చెట్టుకు ఉరి వేసుకొని మహిళ మృతి

by Kalyani |
చెట్టుకు ఉరి వేసుకొని మహిళ మృతి
X

దిశ, యాచారం (ఇబ్రహీంపట్నం) : ఓ మహిళ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సత్యనారాయణ, తెలిపిన వివరాల ప్రకారం..నల్లగొండ జిల్లా, మునుగోడు మండలం, లక్ష్మీదేవిగూడెం, గ్రామానికి చెందిన కప్పెర సాలమ్మ, (30) దసరా వేడుకల కోసం ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటున్న తన అక్క వద్దకు కుటుంబంతో 10 రోజుల క్రితం వచ్చింది. అప్పటినుండి ఆమె మానసికంగా పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉండేదని, ఆదివారం ఉదయం ఖానాపూర్, గ్రామంలో ఉన్న భూమి చూసేందుకు వెళ్లి అక్కడ ఉన్న వేప చెట్టుకు చీర కొంగుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలం వద్దకు వెళ్లి పరిశీలించగా అప్పటికే సాలమ్మ మృతి చెందినట్లు గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story