బైక్ పై నుండి కిందపడి వ్యక్తి మృతి..

by Sumithra |
బైక్ పై నుండి కిందపడి వ్యక్తి మృతి..
X

దిశ, బొంరాస్ పేట్ : బైక్ పై నుండి కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన బొంరాస్ పేట్ మండల పరిధిలోని హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి పై లింగన్ పల్లి స్టేజి దగ్గర చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, కర్ణాటక రాష్ట్రం, బొందెంపల్లి తండాకు చెందిన చందర్, భీంరావులు హైదరాబాద్ లో మేస్త్రి పని చేస్తూ, జీవనం సాగిస్తుంటారు. సొంత ఊరు బొందెంపల్లి తండాలో జరిగిన పండగకు కలిసి వచ్చారు.

తిరుగు ప్రయాణంలో బైక్ పై వస్తుంటే, లింగన్ పల్లి స్టేజి దగ్గర, నాగిరెడ్డిపల్లిలో కొత్తూరు గ్రామపంచాయతీలోని గంగాబాయి తాండకు చెందిన రాథోడ్ రాంనాయక్, తులసి బాయి భార్య భర్తలు ఇద్దరు వ్యవసాయ పనులను ముగించుకొని సైకిల్ పై వస్తుంటే, ఫ్యాషన్ ప్రో బైక్ AP 28 DT1997 ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెనుక భాగంలో కూర్చున్న భీంరావు (35) కిందపడటంతో, తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి భార్య సోనీబాయి, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రమాదానికి అతివేగం అజాగ్రత్త కారణమని తెలుస్తుంది.

Next Story