మంత్రాల నెపంతో వ్యక్తి దారుణ హత్య

by Aamani |
మంత్రాల నెపంతో  వ్యక్తి దారుణ హత్య
X

దిశ, జూలూరుపాడు : మంత్రాల నెపంతో వ్యక్తిని హత్య చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలో చోటుచేసుకుంది. రాచబండ్ల కోయగూడెం గ్రామానికి చెందిన కుంజా బిక్షం (40) అనే వ్యక్తిని సొంత అన్న కొడుకు కుంజా ప్రవీణ్, వరుసకు మామ అయిన మల్కం గంగయ్య ఇద్దరూ కలిసి భిక్షాన్ని గత రాత్రి మద్యం సేవించేందుకు గ్రామ సమీపంలోని చెక్ డ్యాం వద్దకు తీసుకువెళ్లారు. మద్యం సేవించిన అనంతరం ప్రవీణ్, గంగయ్య ఇద్దరు కలిసి బిక్షం ముఖంపై రాయితో కొట్టి హత్య చేసి వాగులో పడేశారు. అయితే మృతి చెందిన బిక్షం చేతబడులు చేస్తాడని అనుమానంతో హత్య చేశారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

విషయం తెలుసుకున్న జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రాణా ప్రతాప్ సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తుల సహాయంతో మృతదేహాన్ని చెక్ డ్యాం నుంచి వెలికి తీసి హత్యకు సంబంధించిన ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయని సీఐ తెలిపారు. నిందితులు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.

Advertisement

Next Story