- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఆసుపత్రి బాత్రూంలో ఆడ శిశువు మృతదేహం.. అధికారుల విచారణ..
by Sumithra |
X
దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి బాత్రూంలో ఆడ శిశువు మృతదేహం లభ్యమైన విషయమై అధికారులు సోమవారం ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. గత రెండు రోజుల క్రితం ఎమర్జెన్సీ వార్డులోని బాత్రూంలో ఎనిమిది నెలల ఆడ శిశువు మృతి చెంది లభ్యమైన విషయం తెలిసిందే. ఈ మేరకు విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందిని విచారించారు. ఒక్కొక్కరిగా ఆ రోజు జరిగిన సంఘటన పై వివరణ తీసుకున్నారు.
ఆస్పత్రిలో ఏం జరుగుతుందో తెలియకుండా అజాగ్రత్తగా ఉండడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మునుముందు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ విచారణలో ఆర్డీవో రమేష్ బాబు, జెడ్పీ డిప్యూటీ సీఈవో పవన్ కుమార్, హుజురాబాద్, జమ్మికుంట తాహశీల్దారులు పాల్గొన్నారు.
Advertisement
Next Story