ఆసుపత్రి బాత్రూంలో ఆడ శిశువు మృతదేహం.. అధికారుల విచారణ..

by Sumithra |
ఆసుపత్రి బాత్రూంలో ఆడ శిశువు మృతదేహం.. అధికారుల విచారణ..
X

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి బాత్రూంలో ఆడ శిశువు మృతదేహం లభ్యమైన విషయమై అధికారులు సోమవారం ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. గత రెండు రోజుల క్రితం ఎమర్జెన్సీ వార్డులోని బాత్రూంలో ఎనిమిది నెలల ఆడ శిశువు మృతి చెంది లభ్యమైన విషయం తెలిసిందే.

ఈ మేరకు విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందిని విచారించారు. ఒక్కొక్కరిగా ఆ రోజు జరిగిన సంఘటన పై వివరణ తీసుకున్నారు. ఆస్పత్రిలో ఏం జరుగుతుందో తెలియకుండా అజాగ్రత్తగా ఉండడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మునుముందు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ విచారణలో ఆర్డీవో రమేష్ బాబు, జెడ్పీ డిప్యూటీ సీఈవో పవన్ కుమార్, హుజురాబాద్, జమ్మికుంట తాహశీల్దారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed