బైక్ ను ఢీకొట్టిన కారు…ఇద్దరు యువకులు మృతి

by Kalyani |
బైక్ ను  ఢీకొట్టిన కారు…ఇద్దరు యువకులు మృతి
X

దిశ, గూడూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి సమీపంలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామానికి చెందిన నీల అరుణ్ కుమార్, సంగెపు మణికంఠ ఇద్దరు యువకులు బైక్ పై మహబూబాబాద్ వెళుతుండగా… మహబూబాబాద్ నుండి నర్సంపేట కు వెళ్తున్న కారు అతి వేగంగా దూసుకు వచ్చి ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. మృత దేహాలను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గూడూరు మండలంలోని పొనుగోడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed