రైలు ఢీకొని 170 గొర్రెలు, 10 మేకలు మృతి..

by Sumithra |
రైలు ఢీకొని 170 గొర్రెలు, 10 మేకలు మృతి..
X

దిశ, చింతల మానేపల్లి : కొమురం భీం జిల్లా సిర్పూర్ టీ మండలంలో రాత్రి వర్షం పడుతున్న సమయంలో గొర్రెల కాపరులు నిద్రిస్తుండగా ఒక్కసారిగా పక్కనే ఉన్న రైల్వే పట్టాల పై గొర్రెలు, మేకలు చేరుకున్నాయి. అంతలోనే గుర్తు తెలియని రైలు ఢీకొని శీర్ష గ్రామానికి చెందిన జడ భీమయ్య అనే యజమానికి సంబంధించిన 170 గొర్రెలు, 10 మేకలు మృతి చెందాయి. ఆదివారం ఉదయం యజమాని లేచి చూసే సరికి రైల్వే పట్టాల పై 170 గొర్రెలు, 10 మేకలు చెల్లాచెదురుగా పడి మృతి చెంది ఉన్నాయి. గొర్రెలను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

Next Story