కరోనాతో సీపీఐ(ఎం) ఎమ్మెల్యే కన్నుమూత

by vinod kumar |
కరోనాతో సీపీఐ(ఎం) ఎమ్మెల్యే కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం వందల సంఖ్యలో జనం వైరస్‌కు బలువుతున్నారు. అలాగే ఎంతో ప్రముఖులు సైతం ప్రాణాలను కోల్పోయారు. తాజాగా.. కేరళకు చెందిన సీపీఐఎం ఎమ్మెల్యేను కరోనా బలి తీసుకుంది. కొంగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయదాస్ కరోనాతో మంగళవారం మృతిచెందారు. గతనెల డిసెంబర్ 11న కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆయన నిన్నరాత్రి మరణించారు. విజయదాస్ మృతిపట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story