- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆసియాలోనే అతి పెద్ద మురికివాడగా పేరు గాంచిన ధారవిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేవలం ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒక్కరు మరణించారు. ఇప్పటి వరకు ఇక్కడ 220 మంది కరోనా బారిన పడగా, 14 మంది మరణించారు. ఇరుకిరుగా ఉండే ఈ ప్రదేశంలో సుమారు 8 లక్షల వరకు ప్రజలు నివసిస్తుంటారు. ఇక్కడ సామూహిక దూరం పాటించటం అనేది కుదరని పని. కరోనా నివారణకు సామూహిక దూరమే ఏకైక మార్గం. ఇందుకు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చాలా పకడ్బందీగా వ్యవహరించారు. కంటైన్ మెంట్ జోన్లలో ఉన్న లక్షన్నర మందిని బయటికి రాకుండా ఇంటింటికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. స్థానికంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అనుమానం వస్తే వెంటనే ఐసొలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. కాగా మహరాష్ట్రలో శుక్రవారం ఒక్కరోజే 778 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 552 కేసులు మంబయిలోనే నమోదయ్యాయి.
Tags: corona,Mumbai,Dharavi,postive,Decline