రూ. 25.5 లక్షల నగదు సీజ్..

by Disha Web Desk 23 |
రూ. 25.5 లక్షల నగదు సీజ్..
X

దిశ, కూకట్​పల్లి: సరియైన పత్రాలు లేకుండా నగదును తరలిస్తున్న వాహనాన్ని బాలానగర్​ ఎస్​ఓటి, కేపీహెచ్​బీ లా అండ్​ ఆర్డర్​ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అందులో తరలిస్తున్న రూ. 25,50,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని జేఎన్​టీయూ కూడలిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా టీఎస్09యూడీ 2154 నెంబరు గల పీవీఎస్​ క్యాష్​ లాజిస్టిక్స్​కు చెందిన వాహనంలో రూ. 25,50,000 నగదును మూడు బాక్సులలో తరలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల కమిషన్​ నిబంధనల ప్రకారం ఎటువంటి ధృవీకరణ పత్రాలు, క్యూఆర్​ కోడ్​, ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా నగదును తరలిస్తున్నందుకు పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని సీజ్​ చేశారు.



Next Story