ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు

by Anukaran |
ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. కానీ రోజుకో ప్రజాప్రతినిధి, ప్రముఖులు వైరస్ బారిన పడుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,392 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారినపడి మరో 11 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8 లక్షల 44 వేల 359కు చేరింది. తాజాగా వైరస్ బారినుంచి 1,549 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య వారిలో 8 లక్షల 16 వేల 322 మందికి పెరిగింది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 21 వేల 235 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ బారినపడి ఇప్పటివరకూ మృతిచెందిన వారి సంఖ్య 6 వేల 802కు చేరింది. అయితే రాష్ట్రంలో కరోనా విస్తృతవ్యాప్తి తగ్గినా అందరూ కరోనా పట్ల జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

Next Story

Most Viewed