కొత్త‌గూడెంలో మ‌రో కరోనా పాజిటివ్ కేసు

by vinod kumar |   ( Updated:2020-06-25 06:49:18.0  )
కొత్త‌గూడెంలో మ‌రో కరోనా పాజిటివ్ కేసు
X

దిశ‌, కొత్త‌గూడెం: కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డు గంగ హుస్సేన్ బస్తీలో గురువారం క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది. దీంతో ప్రజలు ఎవరూ బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని క‌లెక్ట‌ర్ ఎంవీరెడ్డి ఆదేశించారు. అత్యవసర పనులుంటే తప్ప ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. పాజిటివ్ కేసు రావడంతో ఏరియాను కంటైన్మెంట్ చేశామ‌ని చెప్పారు. వార్డులో పారిశుధ్య కార్యక్రమాలు, బ్లీచింగ్, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం చల్లే కార్యక్రమాలను చేపట్టినట్టు కలెక్టర్ తెలిపారు. తాజా పాజిటివ్ కేసుతో కలిపి మొత్తం కొత్త‌గూడెం జిల్లాలో కరోనా కేసులు 10కి చేరాయి.

Advertisement

Next Story

Most Viewed