కరోనా మళ్లీ విజృంభణ.. కొత్తగా ఎన్ని కేసులంటే?

by vinod kumar |
కరోనా మళ్లీ విజృంభణ.. కొత్తగా ఎన్ని కేసులంటే?
X

దిశ,వెబ్ డెస్క్ : కరోనా మళ్లీ విజృంభిస్తొది. రోజు రోజుకి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతొంది. వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన ప్రకారం.. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్తగా 47 మందికి క‌రోనా సోకింది. దీంతో రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు313 నమోదయ్యాయి. కరోనాతో గురువారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 142 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2,434 మంది కరోనాకు చికిత్స పొందుతుండగా, వారిలో 943 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,02,360కి చేరింది. ఇందులో 2,98,262 మంది కోలుకోగా 1,664 మంది చనిపోయారు.

Advertisement

Next Story