ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా

by Shyam |
ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా
X

దిశ, మక్తల్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజరోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా మక్తల్ నియోజకవర్గంలో ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో కరోనా మృతుని అంత్యక్రియల్లో పాల్గొన్న 80 మంది కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా, అందులో 12 మందకి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు.

అంతేగాకుండా అంత్యక్రియల్లో పాల్గొన్న గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి కూడా మహమ్మారి సోకినట్టు వెల్లడించారు. దీంతో వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు.

Advertisement

Next Story