24 గంటల్లో 64 వేల కేసులు

by  |
24 గంటల్లో 64 వేల కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో : దేశంలో కరోనా మహమ్మారి విజృంభన మరింత తీవ్రమైంది. దేశవ్యాప్తంగా ఒక్కరోజులో నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య వరుసగా మూడో రోజు 60 వేల మార్కు దాటింది. ఆదివారం ఉదయం బులెటిన్ వెల్లడించే సరికి గడిచిన 24 గంటల్లో 64,339 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 21,53,000కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ బారిన పడి దేశంలో ఒక్కరోజే 861 మంది మరణించారు. కొత్తగా నమోదైన కరోనా మరణాలతో కలిపి దేశంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 43,379కి చేరింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో కొనసాగుతుండగా, కొత్తగా నమోదవుతున్న కేసుల పరంగా ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారిలో 14లక్షల 80 వేల మంది కోలుకోగా ప్రస్తుతం 6లక్షల 28 వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా కేసుల రికవరీ రేటు 68 శాతంపైగా నమోదవుతోంది. కరోనా సోకిన వారిలో మరణాల రేటు 2.04 శాతంగా ఉంది. మహారాష్ట్రలో ఒక్క రోజులోనే 12,248 కొత్త కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 5,15,332కు చేరింది.

ఇక్కడ కొత్తగా కరోనాతో మరణించిన 390 మందితో కలుపుకొని మొత్తం మరణించిన వారి సంఖ్య 17,757కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 గంటల్లో కొత్తగా నమోదైన 1300 కొత్త కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,45,427కు చేరింది. కొత్తగా 13 కరోనా మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు 4,111 మంది చనిపోయారు. తమిళనాడులో 24 గంటల్లో 5994 పాజిటివ్‌లు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 2,96,901కి చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో 119 మంది చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 4927కు చేరింది. ఏపీలో గడిచిన 24 గంటల్లో 10,820కేసులు నమోదవ్వగా మొత్తం కేసుల సంఖ్య 2,27,860కి చేరింది. ఒక్కరోజే ఏపీలో కరోనాతో 97 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ సోకి 2,036 మంది ప్రాణాలు కోల్పోయారు.


Next Story

Most Viewed