రోడ్డు ప్రమాదం..కానిస్టేబుల్‌ తీవ్ర గాయాలు

by Sampath |
రోడ్డు ప్రమాదం..కానిస్టేబుల్‌ తీవ్ర గాయాలు
X

దిశ, మేడ్చల్: మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీసుస్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన సూరారం కట్టమైసమ్మ చెరువు వద్ద శనివారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. దుండిగల్ పోలీసు స్టేషన్‌‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ రామచంద్రయ్య లాక్‌డౌన్‌ నేపథ్యంలో బహదూర్‌పల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు దగ్గర తనిఖీలు చేపడుతున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ ద్విచక్ర వాహనదారుడు వాహనాన్ని ఆపకుండా సూరారం వైపు దూసుకెళ్లాడు. అనుమానం వచ్చిన కానిస్టేబుల్ రామచంద్రయ్య ఆ వెనుకే వస్తున్న మరో ద్విచక్ర వాహనంపై అతన్ని వెంబడిస్తూ వెళ్ళాడు.ఈ క్రమంలో సూరారం కట్టమైసమ్మ చెరువు మలుపు వద్ద బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌కు లిఫ్ట్ ఇచ్చిన వాహనదారుడికి స్వల్ప గాయాలు కాగా, రామచంద్రయ్య తలకు బలమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే కానిస్టేబుల్‌ను సూరారం నారాయణ మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం యశోద ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది.

Tags: bike accident, medchal injured constable, lockdown

Next Story

Most Viewed