రైతులను బాధ పెట్టొద్దు: కలెక్టర్ అనితా రామచంద్రన్

by Shyam |

దిశ, నల్లగొండ: ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు, మిల్లర్లు రైతులను బాధపెట్టొద్దని, వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితా రామచంద్రన్ అన్నారు. బుధవారం బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ముత్యారెడ్డిగూడెం, గంగసానిపల్లి గ్రామ పంచాయతీలను సందర్శించి, అక్కడి నర్సరీలను పరిశీలించారు. కూలీల అటెండెన్స్‌, సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకుని వారికి శానిటైజర్లు పంపిణీ చేశారు.

tags : rice purchasing centers, visit, collecter anitha ramchandran, yadadri

Advertisement

Next Story

Most Viewed