చల్లా కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్

by srinivas |
చల్లా కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనాతో ఇటీవల మృతి చెందిన దివంగత ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించారు. కర్నూలు జిల్లా అవుకులోని చల్లా రామకృష్ణారెడ్డి స్వగృహానికి వెళ్లిన సీఎం జగన్.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా, కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్ వెంట మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, పాణ్యం మాజీ శాసన సభ్యుడు బిజ్జం పార్థ సారధి రెడ్డి, బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed