Vishnu:సైనికుల కుటుంబాల కోసం విష్ణు కీలక నిర్ణయం.. నువ్వు దేవుడివయ్యా అంటున్న నెటిజన్లు

by Hamsa |
Vishnu:సైనికుల కుటుంబాల కోసం విష్ణు కీలక నిర్ణయం.. నువ్వు దేవుడివయ్యా అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: మోహన్ బాబు(Mohan Babu) విశ్వవిద్యాలయం ప్రో-ఛాన్సలర్ శ్రీ విష్ణు మంచు(Vishnu Manchu) గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాల త్యాగాలను గౌరవించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టినట్లు గా ప్రకటించారు. త్రివిధ దళాల్లో పని చేస్తున్న తెలుగు వారిని గౌరవించుకునేందుకు, వారి పిల్లలకు 50% స్కాలర్‌షిప్‌ను అందించబోతున్నట్టుగా విష్ణు వెల్లడించారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana)లకు మాత్రమే పరిమితం కాకుండా భారతదేశంలోని అన్ని తెలుగు కుటుంబాలకు వర్తించనుందని తెలుస్తోంది. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో అందించే అన్ని కోర్సులకు ఈ స్కాలర్‌షిప్‌(Scholarship)లను అందించనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు మంచు మాట్లాడుతూ.. “మన దేశాన్ని రక్షించడానికి సైనికులు ఎన్నో త్యాగాలు చేస్తారు. వారి సేవలకు గౌరవసూచికంగా, వారికి కృతజ్ఞతలు తెలియజేసే క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. దేశానికి నిస్వార్ధంగా సేవ చేసే వారి సంక్షేమానికి తోడ్పడాలని నిర్ణయించుకున్నాను. ఇతర విశ్వవిద్యాలయాలు, సంస్థలకు మా నిర్ణయం స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నా’’ అని అన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు దేవుడు అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, తిరుపతి(Tirupati)లో 120 మంది అనాథ పిల్లలను విష్ణు మంచు దత్తత తీసుకున్నారు. వారందరికీ మెరుగైన విద్య, వైద్యం అందేలా విష్ణు మంచు అన్ని ఏర్పాట్లను చేశారు.

Next Story

Most Viewed