- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మాల్వీ మల్హోత్రకి క్షమాపణలు చెప్పిన రాజ్ తరుణ్.. వైరల్ అవుతున్న ఎమోషనల్ ట్వీట్!
దిశ, వెబ్డెస్క్: గత కొద్ది నెలలుగా మీడియాలో రాజ్తరుణ్, లావణ్యల ప్రేమ వ్యవహారం దుమ్ముదుమారం రేపుతుంది. రీసెంట్గా రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్ర ముంబైలో ఓ ప్రైవేట్ హోటల్ గదిలో ఉండగా నేరుగా లావణ్య అక్కడికి వెళ్లి గొడవ పెట్టుకుంది. ఈ గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట ఎంతగా వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే. అంతే కాదు ఆమె తాజాగా నార్సింగీ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ పైన కేసు కూడా పెట్టింది. దీంతో మళ్లీ లావణ్య గోల స్టార్ట్ అయ్యింది. కానీ, ఆమె ఎంత వరకు వెళ్లిన రాజ్ తరుణ్ ఆమెను పట్టించుకోకపోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. తాజాగా రాజ్ తరుణ్ X వేదికగా మాల్వీ మల్హోత్రకు క్షమాపణలు చెపుతూ ఓ ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు. అందులో “రీసెంట్గా నీ ఇంట్లో నా కారణంగా జరిగిన సంఘటనలకు నేను బాధపడుతున్నాను మాల్వీ. దయచేసి నన్ను క్షమించు, ఇంత జరిగిన కూడా నువ్వు నన్ను ద్వేషించలేదు. నీ స్నేహితులతో కలిసి వినాయక చవితిని అద్భుతంగా జరుపుకునే అవకాశం కల్పించావు” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.