- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పద్మభూషణ్ అవార్డుపై నందమూరి బాలకృష్ణ ఫస్ట్ రియాక్షన్

దిశ, వెబ్డెస్క్: కేంద్రం పద్మభూషణ్ అవార్డు(Padma Bhushan award) ప్రకటించడంపై నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి(Central Govt) కృతజ్ఞతలు చెప్పారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తనతో పాటు పద్మ అవార్డులు తీసుకున్నవారికి అభినందనలు చెప్పారు. కాగా, నందమూరి బాలకృష్ణతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఏడుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. వైద్యరంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డికి పద్మవిభూషణ్, సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్, ప్రజావ్యవహారాల విభాగంలో మంద కృష్ణ మాదిగకు, కళలు, సాహిత్యం, విద్యా విభాగాల్లో కె.ఎల్.కృష్ణ, మాడుగుల నాగఫణిశర్మ, దివంగత మిర్యాల అప్పారావు, రాఘవేంద్రాచార్య పంచముఖిలకు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.