అచ్చెన్నాయుడు అరెస్ట్ జగన్ కక్ష సాధింపునకు పరాకాష్ట

by srinivas |
Chandrababu Naidu
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ జగన్ కక్ష సాధింపునకు పరాకాష్ట అని పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను చంద్రబాబు ఖండించారు. నిమ్మాడలో గత 40 ఏళ్లలో ఇలాంటి ఉద్రిక్తతలు లేవని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించెందవరు అని చంద్రబాబు ప్రశ్నించారు. దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు పెట్టకుండా అచ్చెన్నాయుడిపై పెడతారా అంటూ నిలదీశారు. అవినీతి కుంభకోణాలు బయటపెట్టడమే నేరమా అంటూ మండిపడ్డారు.

ఉత్తరాంధ్రపై జగన్ కక్ష కట్టారన్నారు చంద్రబాబు. ఉత్తరాంధ్రపై పగబట్టి హింస, విధ్వంసాలు చేస్తున్నారని మండిపడ్డారు. రామతీర్థం ఘటనలో తనపై, కళా, అచెన్నాయుడితో సహా పలువురిపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. సబ్బం హరి ఇల్లు, గీతం వర్సిటీ భవనాలకు ధ్వంసం చేశారన్నారు.

Advertisement

Next Story

Most Viewed