పరాకాష్టకు జగన్ ప్రచారం పిచ్చి..!

by Anukaran |
Chandrababu Naidu
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కొనసాగుతున్న పాలనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ‘ఉన్మాది పాలన నడుస్తోందని.. దాంతో ఊరికో ఉన్మాది’ తయారవుతున్నాడని బాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. ఎన్నడూ చూడని ఉన్మాద పాలనను రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పారు.

సీఎం జగన్ రెడ్డి ప్రచారం పిచ్చ పరాకాష్టకు చేరిందన్నారు. సర్వే రాళ్లపై జగన్ రెడ్డి బొమ్మలు వేయడం, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు, గ్రానైట్ సర్వే రాళ్లపై జగన్ రెడ్డి బొమ్మలు ముద్రించడం మరో తుగ్లక్ చర్య అని కామెంట్స చేశారు. ఏపీని దేశంలో 27వ స్థానానికి వైసీపీ ప్రభుత్వం దిగజార్చిందన్నారు. రాష్ట్రం ముద్దాయిల ఇష్టారాజ్యంగా మారిందని వివరించారు. కరోనా పరిస్థితులను సరిగ్గా ఎదుర్కొంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావన్నారు.

Next Story

Most Viewed