వారాంతం నష్టాలు ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్లు

by S Gopi |
వారాంతం నష్టాలు ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస రికార్డు లాభాలకు బ్రేక్ పడింది. ఆరు సెషన్‌ల పాటు ర్యాలీ చేసిన సూచీలు వారాంతం బలహీనపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేనప్పటికీ దేశీయంగా కొనుగోళ్ల జోరుతో శుక్రవారం ఉదయం లాభాల్లోనే కదలాడిన మార్కెట్లు మిడ్-సెషన్ తర్వాత నుంచి క్రమంగా బలహీనపడ్డాయి. రికార్డు గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, కీలక రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాలు పెరిగాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 269.03 పాయింట్లు నష్టపోయి 77,209 వద్ద, నిఫ్టీ 65.90 పాయింట్ల నష్టంతో 23,501 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, మీడియా, మెటల్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్‌టీపీసీ, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఆల్ట్రా సిమెంట్, ఎల్అండ్‌టీ, టాటా మోటార్స్, నెస్లె ఇండియా, హిందూస్తాన్ యూనిలీవర్, టాటా స్టీల్, రిలయన్స్ స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.57 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed