బిల్ట్ కార్మికుల ఆత్మహత్య యత్నం

by  |
బిల్ట్ కార్మికుల ఆత్మహత్య యత్నం
X

దిశ, మంగపేట : బిల్ట్ కర్మాగారం తెరిపించడంలో ప్రభుత్వ , బిల్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని ఐదుగురు కార్మికులు కర్మాగారంలోని చిప్పర్ సైలో టవర్ ఎక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం లోని బిల్ట్ కర్మాగారం తెరిపించడంలో ప్రభుత్వం, బిల్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని కార్మికుల ఆరోపించారు. వెంటనే పెండింగ్ లో ఉన్న 65 నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ టవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని కార్మికులు శ్రీనివాసరావు,ముత్తయ్య, అప్పిరెడ్డి,చంద్రమౌళి ఆదినారాయణ తెలిపారు.

Next Story