చివరివరకూ పోరాడుతా : కుష్బూ

by Anukaran |
చివరివరకూ పోరాడుతా : కుష్బూ
X

దిశ, వెబ్‎డెస్క్: వీసీకే అధినేత తిరుమావళవన్‎కు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న కుష్బూను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు. మహిళల ఆత్మగౌరవం కోసం చివరి వరకూ పోరాటం చేస్తానని వెల్లడించారు. ప్రధాని మోడీ ఎప్పుడూ మహిళల రక్షణ కోసం ఆలోచిస్తుంటారని తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే ఎందుకు అంగీకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు ఎప్పటికీ సహించం అని స్పష్టం చేశారు.

Advertisement

Next Story