విజయవాడలో బెట్టింగ్ ముఠా అరెస్ట్

by Sumithra |
విజయవాడలో బెట్టింగ్ ముఠా అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. విజయవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన 9 మంది యువకులను రిమాండ్ లోకి తీసుకున్నారు. వీరంతా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.పెనమలూరు పీఎస్ మురళినగర్‌లో అద్దెకు ఇల్లు తీసుకుని క్రికెట్ మజా యాప్ ద్వారా బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. వారి నుంచి రూ.7.50 లక్షల, 20 మొబైల్ కనెక్షన్ కలిగిన కమ్యూనికేటర్ బాక్స్, ల్యాప్‌టాప్, 13 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.



Next Story