ఇవాళ్టి నుంచే అవగాహన కార్యక్రమాలు

by  |
ఇవాళ్టి నుంచే అవగాహన కార్యక్రమాలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర అటవీ శాఖ ఓ ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పర్యావరణంపై విద్యార్థులకు ఆన్ లైన్ లో నేటి నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నది. జూలై 4 వరకు ఆరు రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది. ఈ ఆరు రోజులపాటు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 45 నిమిషాలపాటు సెషన్ ఉంటుందని, ఈ కార్యక్రమంలో పర్యావరణ శాస్త్రవేత్తలు, అటవీశాఖ ఉన్నతాధికారులు పర్యావరణంపై అవగాహన కల్పిస్తారని తెలిపింది.


Next Story

Most Viewed