మధిరలో కరోనా కలకలం

by vinod kumar |
మధిరలో కరోనా కలకలం
X

దిశ‌,ఖ‌మ్మం: జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. మధిర పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారి మాలతి వెల్లడించారు. స‌ద‌రు వ్య‌క్తి కొంత కాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు. కొద్దిరోజుల క్రితం క‌రోనా ల‌క్ష‌ణాలు కనిపించ‌డంతో స‌ద‌రు వ్య‌క్తిని హైద‌రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించగా.. గురువారం కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్లు తెలిపారు. దీంతో జిల్లాలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకు చేరుకుంది. గ్రీన్ జోన్ వైపు అడుగులు వేస్తున్న ఖ‌మ్మం జిల్లా వ‌ల‌స కూలీల రాక‌తో మ‌ళ్లీ ఒక్కో కేసు పెరుగుతూ రెడ్ జోన్‌లోకి జారుకుంటోంది.

Advertisement

Next Story