AP News:‘డయేరియా పై వైసీపీ రాజకీయం’.. మంత్రి కొండపల్లి సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP News:‘డయేరియా పై వైసీపీ రాజకీయం’.. మంత్రి కొండపల్లి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని విజయనగరం జిల్లాలో డయేరియా విలయతాండవం చేస్తుంది. జిల్లాలో డయేరియాతో 8 మంది చనిపోయారని వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆయన ఈ రోజు(ఆదివారం) విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. గుర్ల మండలంలో డయేరియాతో ఒక్కరు మాత్రమే చనిపోయారని.. ఈ విషయాన్ని వైసీపీ రాజకీయం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్య శ్రీ బకాయిలు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ అసిస్టెంట్స్‌కు వేతనాలు ఇవ్వలేదని, గతంలో వైసీపీ చేసిన బకాయిలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పై నెట్టుతారా అని ప్రశ్నించారు. ప్రజలు భయాందోళన చెందేలా వైసీపీ నేతల వ్యాఖ్యలున్నాయని మంత్రి కొండపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed