చంద్రబాబుపై 3 లక్షల మెజార్టీతో గెలుస్తా.. వైసీపీ ఎంపీ సవాల్

by GSrikanth |
చంద్రబాబుపై 3 లక్షల మెజార్టీతో గెలుస్తా.. వైసీపీ ఎంపీ సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ ఎంపీ కేశినేని నాని సవాల్ విసిరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు దమ్ముంటే విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు పోటీ చేస్తే 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అని కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయాక మూటే ముళ్లే సర్దుకొని హైదరాబాద్‌కు వెళ్లడం ఖాయమన్నారు.

ఆస్తులు అమ్ముకొని, అవమానాలు పడి పార్టీని కాపాడుకున్నానని.. అయినా అక్కడ విలువ లేదని అన్నారు. తనను ఆలింగనం చేసుకొని మీలాంటి వ్యక్తులు తమ పార్టీలో ఉండాలని జగన్ ఆహ్వానించారని భావోద్వేగానికి గురయ్యారు. జగన్ నిజమైన అంబేద్కర్ వాది అని కొనియాడారు. కొన్ని మీడియా సంస్థలు కుట్రపూరితంగా జగన్‌పై అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ జగనే ముఖ్యమంత్రి అని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు గెలిస్తే ధనికులు ఆనందంగా ఉంటారు.. జగన్ గెలిస్తే పేదలు ఆనందంగా ఉంటారని కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story