ఆన్ లైన్ మోసం.. భారీగా డబ్బులు పోగొట్టుకున్న 20 వేల మంది మహిళలు

by srinivas |
ఆన్ లైన్ మోసం.. భారీగా డబ్బులు పోగొట్టుకున్న 20 వేల మంది మహిళలు
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా మలమనేరులో 20 వేల మంది మహిళలు ఆన్ లైన్ మోసానికి గురయ్యారు. పెట్టుబడి, అధిక వడ్డీ పేరుతో ఆన్‌లైన్ యాప్ డీఏఏ సంస్థ ఘరానా మోసానికి పాల్పడింది. తమ సంస్థలు పెట్టుబడి పెట్టండని.. మరో 30 మందిని చేర్పించండని, డబ్బులు పూర్తిగా తిరిగిస్తామని, కమీషన్ సైతం తీసుకోండంటూ మహిళలను డీఏఏ ఆన్ సంస్థ నమ్మించింది. దీంతో ఆశపడిన మహిళలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వం ఉద్యోగులు, ఉన్నత విద్య చదువుకున్న వారు ఆన్ లైన్ సంస్థకు డబ్బులు పంపారు. దీంతో కొద్ది రోజులు పాటు డీఏఏ యాప్ సంస్థ వడ్డీ చెల్లించింది. ఆ తర్వాత బోర్డు తిప్పేసింది. దీంతో పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.



Next Story