AP News:ప్రాణం ఉన్నంత వరకు ఆ పార్టీ లోనే కొనసాగుతాం..!

by Disha Web Desk 18 |
AP News:ప్రాణం ఉన్నంత వరకు ఆ పార్టీ లోనే కొనసాగుతాం..!
X

దిశ,తిరుపతి రూరల్: ప్రాణం ఉన్నంత కాలం వైసీపీ లోనే కొనసాగుతామని రామచంద్రపురం మండలం నెత్త కుప్పం పంచాయతీ ఎల్వీ పురం(కట్లకనం)కు చెందిన వైసీపీ సానుభూతి పరులు పేర్కొన్నారు. బుధవారం తుమ్మలగుంట తుడా చైర్మన్, చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకొని మేము నిజమైన వైసీపీ సానుభూతి పరులమని స్పష్టం చేశారు. మాకు ముందస్తు సమాచారం లేకుండానే మాట్లాడాలని పిలిచి టీడీపీ కండువాలు కప్పారని వాపోయారు. ఇలాంటి చర్యలను తాము వ్యతికేరించామన్నారు. అందుకు వారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తామని వెల్లడించారు.

పంచాయితీలో వైసీపీకి బంపర్ మెజారిటీ తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. బలవంతపు పార్టీ ఫిరాయింపులతో బలం ప్రదర్శించాలని అనుకోవడం అవివేకం అన్నారు. తన చిన్నప్పటి ఎద్దు, కప్ప కథను గుర్తు చేసుకున్నారు. బలవంతంగా ఉండే ఎద్దులను చూసి కప్ప కూడా అంత స్థాయికి రావాలని ఊపిరి బిగపట్టి చివరకు ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు. ఇలాంటి బలప్రదర్శనలు దిగరాదని, దిగితే కప్ప గతి పడుతుందని హితవు పలికారు. వైసీపీ నాయకులు, సానుభూతి పరులు వీరే.. భార్గవి, నాగమణి, సంపూర్ణమ్మ, పద్మ, గౌరమ్మ, వెంకటమ్మ, గోవిందమ్మ, గురమ్మ, అమ్మనమ్మ, జ్ఞానమ్మ, ధర్మ రెడ్డి, ధన లక్ష్మి, రాజమ్మ, ముని లక్ష్మి, గీత, సాకేలే, సుమతి, కృష్ణయ్య, బుచ్చి రెడ్డి, సావిత్రమ్మ, దేవి, అరుణాధ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed