AP Politics:కూటమి తోనే అభివృద్ధి సాధ్యం..ఎన్నికల ప్రచారంలో సుజనా చౌదరి

by Disha Web Desk 18 |
AP Politics:కూటమి తోనే అభివృద్ధి సాధ్యం..ఎన్నికల ప్రచారంలో సుజనా చౌదరి
X

దిశ ప్రతినిధి, విజయవాడ: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్డీయే కూటమిని గెలిపించాలని అన్నారు. శివాలయం సెంటర్ భవానీపురం లలితా నగర్, టెలిఫోన్ కాలనీ, రైతుబజార్, ఊర్మిళా నగర్ నుంచి పెద్ద ఎత్తున మహిళలు, బీజేపీ-టీడీపీ-జనసేన నాయకులు, అభిమానులు తరలివచ్చారు. ప్రధాన రహదారితో పాటు అంతర్గత రహదారులు జనంతో కిక్కిరిసిపోయాయి. 42 డివిజన్ లోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో ఇంటింటికీ తిరుగుతూ స్థానికులను ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తానేం చేయబోతున్నానో వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఏపీలో అభివృద్ధి కావాలో అరాచకం కావాలో ప్రజలే తెచ్చుకోవాలన్నారు. చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని, కూటమితోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.

సాధ్యా సాధ్యాలు పరిశీలించి ప్రయత్న లోపం లేకుండా నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యా వైద్యం మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలందరూ భారీ మెజారిటీతో కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ పరిధిలో టీడీపీ అధ్యక్షులు కొనికి కొండయ్య, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ నాయకులు 42 వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ముదిరాజు శివాజీ, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య, వెంకటరమణి జనసేన డివిజన్ అధ్యక్షులు తిరుపతి సురేష్-అనూష దంపతులు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed