Anakapalli: సముద్రంలో ఈతకు వెళ్లి యువకుల గల్లంతు.. గాలింపు

by srinivas |
Anakapalli: సముద్రంలో ఈతకు వెళ్లి యువకుల గల్లంతు.. గాలింపు
X

దిశ,వెబ్ డెస్క్: ఆదివారం కావడంతో సరదాగా సముద్రం(Sea)లో ఈత కొడదామనుకున్నారు. కానీ ప్రమాదంలో పడ్డారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం(Revu Polavaram) వద్ద జరిగింది. రేవు పోలవరం వద్ద ఇద్దరు సముద్రంలో ఈత(swimming) కొట్టేందుకు వెళ్లారు. అయితే సముద్రంలో కెరటాలు భారీ ఎత్తున వచ్చాయి. దీంతో యువకులిద్దరూ ఒక్కసారిగా గల్లంతయ్యారు. నీటిలో కొట్టుకుపోతున్న యువకులను గమనించిన స్థానికులు మెరైన్ పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వెంటనే సముద్రంలో దూకి గల్లంతైన యువకుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed