విశాఖ హనీ‌ట్రాప్ కేసు.. దూకుడు పెంచిన పోలీసులు

by srinivas |   ( Updated:2024-10-07 06:46:32.0  )
విశాఖ హనీ‌ట్రాప్ కేసు.. దూకుడు పెంచిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ హనీ‌ట్రాప్ కేసు(Visakha Honeytrap Case)లో పోలీసులు దూకుడు పెంచారు. మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. ఈ కేసు బాధితులు ఎక్కువగా ఉంటారని అంచనా వేశారు. ఇంకా ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు నిందితులను అదుపులో తీసుకున్నారు. వీరిని విచారిస్తున్న క్రమంలో పలు సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

ఇక హైదరాబాద్ కేంద్రంగా ఈ హనీ ట్రాప్ ముఠా నెట్ వర్క్ నడుస్తోంది. అందమైన అమ్మాయిల ఫొటోలతో పెళ్లికాని యువకులను ఆకర్షించారు. సోషల్ మీడియా ద్వారా అమాయకులను తమ బుట్టలో వేసుకున్నారు. ఆ తర్వాత బాధితులకు మత్తు పదార్థాలు అలవాటు చేశారు. అలా ఆ వ్యక్తులు మత్తులోకి జారుకున్న తర్వాత వారితో యువతులు సన్నిహితంగా ఉన్నట్లు ఫోటోలు తీశారు. ఆ తర్వాత ఫొటోలను బాధితులకు చూపించి డబ్బులు వసూలు చేశారు. ఫొటోలు బయటకు వస్తే పరువుపోతుందన్న భయంతో బాధితులు ఆన్ లైన్ ద్వారా డబ్బులు సమర్పించుకున్నారు. ఈ హనీ ట్రాప్‌లో చాలా మంది యువకులు ఇరుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో నిందితుల ట్రాన్సాక్షన్‌పై పోలీసులు నిఘా పెట్టారు. నగదు లావాదేవీలకు సంబంధించి ఆరా తీస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని తెలిపారు. నిందుతులను వదిలేది లేదని పోలీసులు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed