AP Politics:‘కూటమి తోనే అభివృద్ధి సాధ్యం’..ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ కుమార్తె

by Disha Web Desk 18 |
AP Politics:‘కూటమి తోనే అభివృద్ధి సాధ్యం’..ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ కుమార్తె
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: అభివృద్ధికి అవకాశం ఇచ్చి ఎంపీగా ఎం శ్రీ భరత్, ఎమ్మెల్యేగా గణబాబు లను గెలిపించాలని సినీ హీరో బాలకృష్ణ కుమార్తె, ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీ భరత్ సతీమణి తేజస్విని కోరారు. కేవలం ప్రజా సంక్షేమం ప్రధాన అజెండాగా ధ్యేయంగా ఉన్న ఇద్దరినీ గెలిపించుకుంటే సంక్షేమాన్ని మన ఇంటికి తెచ్చుకున్నట్లేనని ఆమె పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 40వ వార్డు ఏకేసీ కాలనీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె ప్రధాన ప్రసంగం చేశారు. ఎమ్మెల్యే గణ బాబు కోడలు నిహారిక తదితరులు పాల్గొన్న సభలో తేజస్విని మాట్లాడుతూ ఈ ప్రాంతంలో చదువుకునే పిల్లలకు డిజిటల్ లైబ్రరీ నిర్మిస్తామన్నారు.

అన్న క్యాంటీన్ ఏర్పాటు, సూపర్ 6 పథకాలతో ఇంటింటికి మంచి చేయాలనుకుంటున్న చంద్రబాబు నాయుడునీ సీఎం చేద్దామన్నారు. భరత్ మన పిల్లల భవిష్యత్తుకు భద్రత ఇవ్వాలని కంకణం కట్టుకున్నారని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు అంకితమై గణ బాబు సేవ చేస్తారని అన్నారు. కార్యక్రమంలో జనసేన నేత అంగ దుర్గా ప్రశాంతి, టీడీపీ నేతలు గేదెల రమణ, కొల్లూరు,యూత్ ఉపాధ్యక్షుడు మధు బాబు, RR రాజు, పీ. సురేష్, నానాజీ, నూకరాజు, కృష్ణారావు పాల్గొన్నారు. జనసేన నాయకులు కె.శివ శంకర్, కె.నాని, సంతోష్, అప్పలరాజు, నాగమణి, రమణమ్మ, శ్రీ విద్యా, జ్యోతి, గోవింద, గణేష్, వీర్రాజు, రమణ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed