- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
సీఎం చంద్రబాబుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమావేశం..కారణం ఏంటంటే?
దిశ,వెబ్డెస్క్:నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) నాయుడుతో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. అయితే ఈ రోజు విజయవాడకు (Vijayawada) మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ రోజు సాయంత్రం 3 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి ఉత్తమ్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే..సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ (Telangana) నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం పై కీలక చర్చలు జరుగుతున్నాయి. కానీ వాస్తవానికి మంత్రి ఉత్తమ్ తన చిన్ననాటి మిత్రుడిని (Childhood Friend) పరామర్శించేందుకు విజయవాడ (Vijayawada) కు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. ఏది ఏమైనా వీరి సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకుంటోంది.