Union Minister: విమానాశ్రయాల సామర్థ్యం పెంచుతున్నాం

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-27 15:24:59.0  )
Union Minister: విమానాశ్రయాల సామర్థ్యం పెంచుతున్నాం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో 7 కొత్త ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుకు సర్వే నిర్వహించబోతున్నట్లు కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, కుప్పం, ఒంగోలు-నెల్లూరు, అనంతపురం ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు.. ఏపీలో త్వరలోనే సీ-ప్లేన్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రకటించారు. మొట్టమొదటి సీ ప్లేన్ డెమో.. ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు నిర్వహిస్తామని అన్నారు. ఏపీలో విమానాశ్రయాల సామర్థ్యం పెంచుతున్నట్లు వెల్లడించారు. అంతకుముందు వైసీపీ ప్రభుత్వంపై రామ్మోహన్ నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రజల తీర్పును వైసీపీ వక్రీకరిస్తోందని అన్నారు. 11 సీట్లకే ప్రజలు పరిమితం చేసినా వారిలో ఇంకా మార్పు రావడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక.. దేశ వ్యాప్తంగా ఏపీకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed