- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
వరద బాధితులకు ఆపన్నహస్తం..చెక్కు అందించేందుకు ఏపీకి వచ్చిన టాలీవుడ్ ప్రముఖులు
దిశ,వెబ్డెస్క్:రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా ఏపీలోని విజయవాడ(Vijayawada)ను, తెలంగాణ(Telangana)లోని ఖమ్మం జిల్లాను వరదలు(Floods) ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరద బాధితులకు(Flood Victims) టాలీవుడ్ ప్రముఖులు ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఇప్పటికే విజయవాడలో ముంపు బాధితులకు సినీ ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు, సిద్ధు జొన్నలగడ్డ రూ.15 లక్షలు, విశ్వక్ సేన్ రూ.5 లక్షలు సీఎం సహాయనిధికి విరాళంగా(Donation) ప్రకటించారు. ఈ నేపథ్యంలో విరాళం తాలూకు చెక్లు(Check) అందించేందుకు బాలయ్య, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ నేడు(గురువారం) హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు.
ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్టులో బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో వరదలు ప్రభుత్వమే సృష్టించిందని చెబుతున్నారని..ఇంతకంటే కామెడీ ఉంటుందా? అని బాలయ్య వ్యాఖ్యానించారు. వరదల(Flood)పై లేనిపోని రచ్చ చేశారని, వాళ్ల పేర్లు ఎత్తడం కూడా అనవసరమని పేర్కొన్నారు. ఇంతకుమించి దీనిపై ఏమీ మాట్లాడలేమని చెప్పారు. రాష్ట్రంలో వరద బాధితుల(Flood Victims) పరిస్థితి చూసి చలించిపోయి తాము విరాళాలు ప్రకటించామని తెలిపారు. ఆ విరాళాన్ని ప్రభుత్వానికి(Government) అందించేందుకు నేడు రాష్ట్రానికి వచ్చామని బాలకృష్ణ వెల్లడించారు. యువ నటులు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వంటి వారు విరాళాలు(Donations) అందించేందుకు ముందుకు రావడం అభినందనీయం ఆయన తెలిపారు.