చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు..రూ. 25 లక్షల ఏటీఏం నగదు చోరీ

by srinivas |
చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు..రూ. 25 లక్షల ఏటీఏం నగదు చోరీ
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో ముగ్గురు దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి సమయంలో ముసుగులు ధరించి గుడిపాలలో రెండు ఏటీఎం మెషిన్లను ధ్వంసం చేసి రూ. 25 లక్షలు చోరీకి పాల్పడ్డారు. ఓ ఏటీఎంలో రూ. 13 లక్షలు, మరో ఏటీఎంలో రూ. 12.9 లక్షలను ఎత్తుకెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు ఛేదించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో విస్తృతంగా గాలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.

Advertisement

Next Story