- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
వైసీపీ ఎమ్మెల్సీ మూడో పెళ్లి.. సాక్షి సంతకం పెట్టిన రెండో భార్య ,కొడుకు
దిశ , డైనమిక్ బ్యూరో : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ మూడో పెళ్లి చేసుకున్నారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుజాత మెడలో సంప్రదాయంగా మూడుముళ్లు వేసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. కైకలూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో సోమవారం ఉదయం ఈ జంట అధికారికంగా ఒక్కటైంది. కైకలూరు సబ్ రిజిస్ట్రార్ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని వారికి అందజేశారు. ఇకపోతే ఎమ్మెల్సీ జయ మంగళ రెండో భార్య సునీత, కుమారుడి సమక్షంలో ఈ వివాహం జరగడం గమనార్హం. అంతేకాదు ఈ వివాహానికి సునీత సాక్షి సంతకం చేయడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయారు. వారికి ఒక కుమార్తె. తర్వాత సునీతను రెండో పెళ్లి చేసుకోగా వారికి ఒక కుమార్తె, కుమారుడు సంతానం. అయితే రెండో భార్యతో విబేధాల నేపథ్యంలో ఆమెనుంచి విడాకులు తీసుకున్నారు. తాజాగా నేడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుజాతను మూడో పెళ్లి చేసుకున్నారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకుంటున్న సుజాతకు ఇది రెండో వివాహం. ఆమెకు కూడా ఒక కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది.