గంజాయి విక్రేతలు అరెస్ట్‌..

by Kalyani |
గంజాయి విక్రేతలు అరెస్ట్‌..
X

దిశ‌, ఏటూరునాగారంః- నిషేదిత గంజాయి విక్ర‌యిస్తున్న, గంజాయి సేవిస్తున్న ఇద్ద‌రు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించిన‌ట్లు నూగూరు వెంక‌టాపురం సీఐ బండారి ర‌వికూమార్ తెల‌పారు. సీఐ క‌థ‌నం మేర‌కు.. భ‌ద్రాచ‌లం ఏరియా నుండి ఇద్ద‌రు వ్య‌క్తులు ప్ర‌భుత్వ నిషేదిత గంజాయిని తీసుకుని వచ్చి నూగురు వెంక‌టాపురం ఏరియాలో కొంత‌మంది వ్య‌క్తులు అమ్ముతూ సేవింస్తున్నార‌న్న నమ్మ‌ద‌గిన స‌మాచారం మేర‌కు పోలిస్ సిబ్బందితో వెంక‌టాపురం మండ‌ల మ‌రికాల గ్రామానికి వెళ్లె దారిలోన 5 గురు వ్య‌క్తులు పోలీసుల‌ను చూసి పారిపోతుండ‌గా వారిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నంలో 4 గురు పట్టుబ‌డ్డార‌ని, ఒక వ్య‌క్తి త‌ప్పించుకున్నాడ‌ని సీఐ తెలిపారు. కాగా ప‌ట్టుకున్న వ్య‌క్తులను పంచనామా నిర్వహించి సుమారు రూ. 1,27,750 విలువ గ‌ల 5 కేజీల గంజాయిని స్వాధీన ప‌రుచుకున్న‌ట్లు వెంక‌టాపురం సీఐ తెలిపారు. ప‌ట్టుబ‌డిన వ్య‌క్తులు తోక‌ల దుర్గ ప్ర‌సాద్‌(23), ప్ర‌శాంత్ కూమార్‌(25), గుండ‌మ‌ల్ల రోహీత్(23), కుర్సం నీల‌మ‌ణికంఠ‌గా గుర్తించామ‌ని ప‌ట్టుబ‌డిన వ్య‌క్తులపై కేసు న‌మోదు చేసి రిమాండ్‌కు త‌ర‌లించిన‌ట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed