ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

by Disha Web Desk 16 |
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామభద్రాపురం మండలం కొటక్కి వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందజేశారు. వాహనదారులు డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. అతివేగంగా అసలు నడపొద్దని పోలీసులు సూచించారు. కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని వాహనాలు నడపాలన్నారు. మద్యం తాగి అసలు డ్రైవింగ్ చొయద్దని చెప్పారు. అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు సూచించారు.


Next Story

Most Viewed