- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎన్నికల కోడ్ ముగియగానే అభివృద్ధి పథకాలు అమలు చేస్తాం
దిశ, కాటారం : ఐదు గ్యారెంటీ పథకాలు ఎన్నికల కోడ్ ముగియగానే పూర్తిస్థాయిలో అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం కాటారం మండలంలోని ధన్వాడ, విలాసాగర్ గ్రామాలలో శ్రీధర్ బాబు పర్యటించారు. ప్రభుత్వానికి సంబంధించిన పథకాలన్నీ ఎన్నికల కోడ్ ముగియగానే పూర్తిస్థాయిలో అమలులోకి వస్తాయని తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను దన్వాడ గ్రామంలో మంత్రి శ్రీధర్ బాబుకు విన్నవించారు. ప్రజలు విన్నవించిన ఆయా సమస్యలపై శ్రీధర్ బాబు స్పందిస్తూ పరిష్కారానికి తగు సూచనలు చేశారు. ఇసుక అక్రమంగా రవాణా చేస్తే ఉపేక్షించవద్దని కాటారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున రావును ఆదేశించారు.
గృహ అవసరాల కోసం ఇసుక తెచ్చుకునేందుకు సరైన విధానం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రాను ఆదేశించారు. మండలంలో ట్రాక్టర్ ఓనర్లు అసోసియేషన్ గా ఏర్పాటై ఇతర గ్రామాల నుండి ఇసుక తీసుకురాకుండా అడ్డుకుంటున్నారని, ఫలితంగా ఇసుక రేటు రెండు రెట్లు పెరిగిందని పలువురు మంత్రికి విన్నవించారు. అనంతరం మండలంలోని విలాసాగర్ గ్రామంలో మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంతకానీ సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు విలాస్ రావు, ప్రభాకర్ రెడ్డి, కోట రాజబాబు, వామన్ రావు, చీమల సందీప్, అందే సత్యనారాయణ, జాడి మహేశ్వరి, చీటూరి మహేష్, దండు రమేష్, అయిత రాజిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.