తిరుమల లడ్డూ వివాదం.. బ్రాహ్మణ సంఘాల ఆందోళన

by Jakkula Mamatha |
తిరుమల లడ్డూ వివాదం.. బ్రాహ్మణ సంఘాల ఆందోళన
X

దిశ, నరసరావుపేట: తిరుమల తిరుపతి లడ్డులో కల్తీకి నిరసనగా శనివారం నర్సరావుపేటలో బ్రాహ్మణ సంఘాలు ఆందోళనకు దిగాయి. వైసీపీ నేతలు తిరుమల తిరుపతి దేవస్థానం భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత జగన్ తిరుపతిలో అడుగుపెట్టాలని నినాదాలు.. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కల్తీకి బాధ్యులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ సంప్రదాయాలు గౌరవించే వారినే రాష్ట్రంలో ఉన్న అన్ని దేవస్థానం పాలక మండల్లలో నియమించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story