సొంత సొమ్ముతో జనసేన సభ్యత్వాలు.. ప్రశంసలు అందుకుంటున్న ఆ గ్రామ సర్పంచ్

by Jakkula Mamatha |
సొంత సొమ్ముతో జనసేన సభ్యత్వాలు.. ప్రశంసలు అందుకుంటున్న ఆ గ్రామ సర్పంచ్
X

దిశ, కోనసీమ ప్రతినిధి: రామచంద్రపురం నియోజకవర్గం బంధన పూడి గ్రామ సర్పంచ్ డేగల తిరుమల వేణి గ్రామంలో 550 మందికి జనసేన సభ్యత్వం చేయించారు. వారి సభ్యత్వం రుసుమును ఆమె చెల్లించారు. దీనివల్ల గ్రామంలో జనసేన మరింతగా బలపడటంతో పాటు పేదవారికి బీమా వర్తిస్తుందనేది తన ఉద్దేశమని ఆమె చెప్పారు. ఈ విషయమై జనసేన అధిష్టానం సర్పంచ్ తిరుమల వేణిని ప్రశంసలతో ముంచెత్తుతోంది. పార్టీ అధికారిక వెబ్ సైట్‌లో కూడా ప్రత్యేక కథనం రాసింది. ఇటీవల వరద బాధితులకు లక్ష రూపాయల చెక్‌ను మంత్రి సుభాశ్ ద్వారా అందించారు. ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గ పార్టీ ఇంచార్జి పోలిశెట్టి చంద్రశేఖర్.. సర్పంచ్‌ తిరుమల వేణిని కలిసి అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed