మరోసారి విచారణకు హాజరైన మాజీ మంత్రి.. దర్యాప్తునకు సహకరించలేదన్న పోలీసులు

by Jakkula Mamatha |
మరోసారి విచారణకు హాజరైన మాజీ మంత్రి.. దర్యాప్తునకు సహకరించలేదన్న పోలీసులు
X

దిశ,వెబ్‌డెస్క్: గత ప్రభుత్వ హాయంలో చంద్రబాబు ఇంటి పై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో భాగంగా ఇప్పటికే రెండు సార్లు విచారణకు హాజరైన జోగి రమేష్‌కు మరోసారి విచారణకు హాజరు కావాలని మంగళగిరి పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు(బుధవారం) జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఇంటి పై దాడి కేసు సంబంధించి మంగళగిరి పోలీసు స్టేషన్‌లో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ ముగిసింది.

పోలీసులు సుమారు రెండు గంటల పాటు 27 ప్రశ్నలు అడిగారు. ఈ కేసులో ఇప్పటి వరకు 4 పాస్ పోర్టులు, 8 ఫోన్లు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎప్పటిలాగే జోగి రమేష్ దర్యాప్తునకు సహకరించలేదని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఆయన చెప్పిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని అన్నారు. ఈ క్రమంలో నిందితులు సహకరించడం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. దీంతో మాజీ మంత్రి జోగి రమేష్‌ను మరోసారి విచారణకు పిలుస్తామన్నారు.

Next Story