Breaking: పుంగనూరులో హై టెన్షన్.. పోలీస్ శాఖ సంచలన నిర్ణయం

by srinivas |
Breaking: పుంగనూరులో హై టెన్షన్.. పోలీస్ శాఖ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా పుంగనూరులో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. అల్లర్ల నేపథ్యంలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28 వరకూ పుంగనూరులో 144 సెక్షన్ విధించారు. అనుమతి లేకుండా ఎవరూ పుంగనూరుకు రావొద్దని హెచ్చరించారు. ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించొద్దని.. ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

ఇటీవల ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. పలుచోట్ల ప్రభుత్వ ఆస్తులు సైతం ధ్వంసం అయ్యాయి. ఎంపీ మిథున్ రెడ్డి కారుతో పాటు మాజీ ఎంపీ రెడ్డప్ప కారు సైతం ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో పోలీసులకు సైతం గాయాలయ్యాయి. ఈ అల్లర్ల నేపథ్యంలో రెండు పార్టీల నాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మారోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో పుంగనూరులో 144 సెక్షన్‌ను కొనసాగిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.



Next Story