మే 13న వైసీపీ మాడి మసై పోతుంది: చంద్రబాబు

by Disha Web Desk 16 |
మే 13న వైసీపీ మాడి మసై పోతుంది: చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: మే 13న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాడి మసై పోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా సీఎం జగన్, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఐదుగురు వ్యక్తులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ హయాంలో అన్ని స్కాములేనని విమర్శించారు. రాష్ట్రంలో ఎండల బాదుడుకంటే జగన్ బాదుడే ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో వైసీపీ గెలిచే పరిస్థితి లేదని... ప్రభుత్వం కూలిపోవాలని చంద్రబాబు శాపనార్ధం పెట్టారు. కేజీఎఫ్-1,2 చూడాలంటే కోలార్ పోవాలని.. కేజీఎఫ్ -3 చూడాలంటే సర్వేపల్లికి రావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంత్రి కాకాణి అవినీతి పరుడని... వనరులను దోచుకున్నారని ఆరోపించారు. కాకాణి దోచుకున్న వనరులే ఆయన్ను రాజకీయ సమాధి చేస్తాయని జోస్యం చెప్పారు. మైనింగ్ మాఫియాగా ఏర్పడి కొండలు, గుట్టలను ధ్వంసం చేశారన్నారు. క్వార్జ్‌లో రూ. 4, 500 కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలోని డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్ కు పోతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్నది క్లాస్ వార్ కాదని.. క్యాష్ వార్ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read More..

ఏపీలో బచ్చా రాజకీయం.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు



Next Story

Most Viewed